Theft cases involving motors and gas cylinders solved : Three arrested సంగెం మండలంలో చోరీలకు పాల్పడుతున్న ముఠాల ఆటకట్టించి, కేసులు ఛేదించినట్లు సంగెం పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు జరిపి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
కాపుల కనపర్తి వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పిడుగు యాదగిరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని నుంచి 17 వ్యవసాయ నీటి మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ దృశ్యాల ఆధారంగా గుండేటి రాజ్కుమార్, మంకలి రవిలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దొంగిలించిన భారత్ గ్యాస్ సిలిండర్, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ స్కూటీని రికవరీ చేశారు. కేసులను వేగంగా ఛేదించిన సంగెం ఎస్ఐ కే. వంశీకృష్ణ, సిబ్బందిని పర్వతగిరి సీఐ రాజగోపాల్ అభినందించారు. ప్రజలు రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు.
