
- ఆ ఫార్మసీ జేబులో “డ్రగ్ ఇన్స్పెక్టర్లు”..!
- తనిఖీలు లేవ్ చర్యలేవ్..!!
- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కేర్ ప్లస్ ఫార్మసీ నిర్వాహకులు…
- జనరిక్ మందులను ఎంఆర్పీ రేట్లకు అమ్ముతున్న కేర్ ప్లస్ ఫార్మసీ నిర్వాహకులు…
“Care Plus” Pharmacy Route Separate : హనుమకొండ నగరంలోని మెడికల్ షాపుల్లో ఔషధ శాఖ అధికారుల తనిఖీలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఒకవేళా తనిఖీలు చేపట్టినా అది తూతూ మంత్రమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుంది. ఏకంగా అతి తక్కువ ధరలో లభించే జనరిక్ మందులను అత్యధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు హనుమకొండ చౌరస్తాలోని కేర్ ప్లస్ ఫార్మసీ సాక్ష్యంగా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. కొంతమంది అయితే ఫార్మా పేరిట జనరిక్ మందులను అత్యధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ప్రచారం లేకపోలేదు. ఇదే క్రమంలో కేర్ ప్లస్ ఫార్మసీ మెడికల్ షాపులో జనరిక్ మందులను విక్రయిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ షాపులో కూడా అర్హత కలిగినా ఫార్మాసిస్టులు ఉన్నారా అనే సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.
“Care Plus” Pharmacy Route Separate
జనరిక్ మందులను ఎమ్మార్పీ ధరలకు అమ్ముతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నా ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రం ఆ షాపు నిర్వాహకులకు ఆశీస్సులు అందించేలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఔషధశాఖ ఉన్నతాధికారులు మెడికల్ షాపులను తనిఖీలు చేసి ఫార్మాసిస్టులు లేని బినామీ షాపుల లైసెపును రద్దు చేయడంతో పాటు సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేయాలని, జనరిక్ మందులను ఎంఆర్పీ ధరలకు అమ్ముతున్న కేర్ ప్లస్ ఫార్మసీ పట్ల చర్యలు చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు.
“Care Plus” Pharmacy Route Separate
- డ్రగ్ ఇన్స్పెక్టర్ల పై విచారణ చేపట్టాలి
- డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. తిరుపతి డిమాండ్
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి
“Care Plus” Pharmacy Route Separate
హనుమకొండ నగరంలో మెడికల్ షాపుల నిర్వాహణ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. నిబంధనలు అతిక్రమించే మెడికల్ షాపుల పట్ల చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
“Care Plus” Pharmacy Route Separate :హనుమకొండ చౌరస్తాలోని కేర్ ప్లస్ ఫార్మసీ పై సమగ్రమైన విచారణ చేపట్టకుండా డ్రగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదు. జనరిక్ మందులను యధేచ్ఛగా ఎంఆర్పీ రేట్లకు అమ్ముతున్న కేర్ ప్లస్ ఫార్మసీ పై ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనలు చేయక తప్పదు.