
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని వీసికే పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెరిపల్లి ఆనంద్ డిమాండ్…
- “కేర్ ప్లస్” ఫార్మసీ” మెడికల్ షాప్ కు అండగా నిలుస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం…
“Care Plus” Pharmacy” Medical Shop Receives Blessings from Drug Inspectors : హనుమకొండ చౌరస్తలోని “కేర్ ప్లస్” ఫార్మసీ” మెడికల్ షాప్ కు డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయనేది బహిరంగ రహస్యంగా మారింది. ఆ షాపులో జనరిక్ మందులను సైతం తమ లాభార్జనలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నప్పటికీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
“Care Plus” Pharmacy” Medical Shop Receives Blessings from Drug Inspectors
అయితే మెడికల్ షాపు ముసుగులో ప్రభుత్వం అందించే రాయితీ మందులను నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రైవేట్ మెడికల్ షాపులో విక్రయిస్తూ విచ్చలవిడిగా దందా చేయడంలో ఆ మెడికల్ షాప్ యాజమాన్యం ఆరితేరిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ మెడికల్ షాపులో కొనుగోలుదారులే సాక్ష్యంగా ఉన్నారనేది గమనార్హం. ఆ మెడికల్ షాపులో జనరిక్ మందులు అమ్ముతూ అధిక రేట్లు ఎందుకు తీసుకుంటున్నారని ఎవరైనా వినియోగదారులు ప్రశ్నిస్తే ఇదంతా డ్రగ్ ఇన్స్పెక్టర్లకు తెలుసు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దబాయించడం పలువురు బాధితులను షాక్ కు గురి చేసినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా డ్రగ్ ఇన్స్పెక్టర్లు యధేచ్ఛగా ఆ మెడికల్ షాపుకు అండగా నిలువడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో వీసీకే పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇట్టి విషయంలో స్పందించారు. తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ప్రతినిధి బృందం కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.