
- “సోమ్లాతండా”లో నీరుగారుతున్న గిరిజన విద్య..!
- కరువైన అధికారుల పర్యవేక్షణ…
- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న టీచర్…
- పాఠం చెప్పని, బడిలో సమయం కేటాయించని టీచర్ పై విచారణ శూన్యం…
- సంబంధిత ఐటిడిఎ అధికారులకు ఫిర్యాదు చేయనున్న విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు…
- మూడు రోజులు సెలవులే అధికారులు మర్చిపోతారని ధీమా వ్యక్తం చేస్తున్న సదరు టీచర్…
Mulugu district ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గరలోని somlathanda సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉత్తుత్తి విద్యా సాగుతోంది. ఆ పాఠశాల టీచర్ పాఠం చెప్పేది లేదు, బడిలో సమయం కేటాయించేది లేదనేది బహిరంగ రహస్యమే. దీంతో గిరిజన విద్యా కుంటుపడుతుందని, గిరిజన విద్యాపై, గిరిజన పాఠశాల నిర్వాహణపై సంబంధిత ఐటిడిఎ అధికారుల పర్యవేక్షణ కరువైందని విద్యార్థి యువజన ప్రజాసంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇందుకు somlathanda సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో సదరు టీచర్ వ్యవహరించే తీరే సాక్ష్యంగా నిలుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల ఆశీస్సులతోనే సదరు టీచర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. అధికారుల దృష్టికి ఇట్టి విషయం తీసుకెళ్ళి వివరణ కోరినప్పటికీ దాటవేత దోరణిలో వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. అధికారుల మౌనం వెనుక మతలబేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అధికారుల ఆశీస్సులతోనే సదరు టీచర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను బలపరుస్తున్నాయి.
మరోవైపు త్వరలోనే పలు విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు, గిరిజన విద్యా అభివృద్ధిని కోరుకునే సంస్థలు సంబంధిత itda ఐటిడిఎ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనప్పటికీ ములుగు జిల్లా somlathanda సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల నిర్వాహణపై అక్కడి విద్యార్థుల సంఖ్య, టీచర్ నిర్వహించే విధుల పట్ల అధికారులు సమగ్రమైన విచారణ చేపట్టి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు
- మూడు రోజులు సెలవు వస్తున్నాయ్….వార్తాకథనాలు అధికారులకేం గుర్తుంటాయ్…బరితెగించిన టీచర్ బలాదూర్ ప్రచారం పట్ల “జనం నిర్ణయం” మరో కథనం త్వరలో…