
- యధేచ్ఛగా సాగుతున్న నకిలీ విత్తనాల దందా..!
- పరకాల సమీప మండలంలోని ఓ గ్రామం కేంద్రంగా సాగుతున్న విత్తనాల దందా…!!
- చోద్యం చూస్తున్న అధికారులు
- నష్టపోతున్న రైతులు…
Fake seed business at the center of the scam : హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంగా నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోందనేది బహిరంగ రహస్యంగా మారింది. కొందరు అక్రమార్కులు అమాయక రైతులకు మాయమాటలు చెప్పి నిండా ముంచుతున్నట్లు తెలుస్తోంది.
Fake seed business at the center of the scam
నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులు, అధికారులు అక్కడక్కడా చర్యలు చేపడుతున్నప్పటికీ నకిలీ దందా ఆగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా పరకాలకు సమీప మండలంలోని ఓ గ్రామం కేంద్రంగా సాగడం గమనార్హం. దీనికి పరకాల పట్టణం ఆయువు పట్టుగా ఉండటం బహిరంగ రహస్యమే. ప్రతిఏటా వానాకాలంలో అత్యధికంగా వేలు ఎకరాల్లో రైతులు పత్తి పంటలు, ఇతర పంటలు సాగు చేస్తుంటారు. దీనిని ఆసరా చేసుకున్న దళారులు కొన్నేళ్లుగా పత్తి విత్తనాల నకిలీ దందాను మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ దందా పరకాలలోని పొలిటిషియన్ కనుసన్నలలో జరుగటం కొసమెరుపు…!
Fake seed business at the center of the scam
- పరకాల కేంద్రంగా జరుగుతున్న నకిలీ విత్తనాల దందా తీరు ఎలా ఉంది…?
- పరకాల సమీప మండలం ఏంటీ…? పొలిటికల్ లీడర్ కనుసన్నల్లో జరుగుతున్న నకిలీ విత్తనాల దందాపై సమగ్రమైన కథనం త్వరలో….