
- అనుమతికి అవకాశం లేకున్నా అడ్మిషన్లు..!
- అకాడమీల పేరుతో నయా మోసం..!!
- రాజస్థాన్ కోటా పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నా వెలసిటి యాజమాన్యం..!
- విద్యార్థులను చేర్చుకొని మూడు బ్రాంచీలు ప్రారంభం…
- అడ్మిషన్లు మొదలుపెట్టి వెలసిటి జూనియర్ కాలేజీ ప్రారంభించిన యజమాన్యం
- విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు…
Velocity has no identity : ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డ్ హెచ్చరించింది. ఇలాంటి కార్యకలపాలపై నిఘా పెట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అవసరమైతే పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టాలని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులకు సూచించింది.
Velocity has no identity
కానీ హనుమకొండ జిల్లాలో అనుమతులే లేనటువంటి వెలసిటి జూనియర్ కాలేజీ బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కి జిల్లాలో విద్యార్థులను చేర్చుకోవడం బహిరంగ రహస్యమే. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించుకునేందుకు వెలసిటి జూనియర్ కాలేజీ ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని రంగంలోకి దింపడం గమనార్హం. వెలసిటికి ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టంగా తెలిసినా మూడు చోట్ల వెలాసిటీ పేరుతో జూనియర్ కాలేజీ ప్రారంభం చేసినా అధికారులు మాత్రం వెలసిటి జూనియర్ కాలేజీ ప్రవేశాలను అడ్డుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Velocity has no identity
కళ్ళ ఎదుటె వెలసిటి జూనియర్ కాలేజీ బోర్డు పెట్టి విద్యార్థులను చేర్చుకుంటున్నా హనుమకొండ జిల్లా అధికారి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా వెలసిటి జూనియర్ కాలేజీ జేఈఈ నీట్ అకాడమీ పేరుతో ఎలాంటి అనుమతి లేని వెలాసిటీ జూనియర్ కాలేజ్, జేఈఈ నీట్ అకాడమీల పేరుతో హనుమకొండ నగరంలో మూడు చోట్ల కాలేజీనీ ప్రారంభించడం వల్ల విద్యార్థుల భవిష్యత్ కు భరోసా ప్రశ్నార్థకంగా మారుతోందని పలువురు భావిస్తున్నారు. అధికారుల అండతోనే ప్రవేశాలు ప్రారంభించారని అనుమానాలకు బలం చేకూరుతుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి వెలసిటి జూనియర్ కాలేజీ జేఈఈ నీట్ అకాడమీలపై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే…!