
- భారత్ ను అవమానించిన ట్రంపు ప్రభుత్వం- పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా
Trump government insulted india
ట్రంపు ప్రభుత్వం భారత్ ను భారతీయులను బహిష్కరించి తీవ్రంగా అవమానించిందని, ఇది అమెరికా అహంకారానికి నిదర్శనమని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా విమర్శించారు.
ఆదేశ అభివృద్ధిలో భాగస్వాములైన భారతీయులకు సంకెళ్లు, గొలుసులు వేసి తరలించిన తీరు భారత్ దేశాన్ని అగౌరపరిచిందని, ఇది ఫాసిస్ట్ చర్యల్లో భాగమేనని, డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో భారతీయుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వ వైఖరి ప్రజలకు తల వంపులు తీసుకువచ్చేలా ఉందని పేర్కొన్నారు.
Trump government insulted india
ఇదే అంశంపై సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ఫ్లోర్ లీడర్ రాజారామ్ సింగ్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు లేఖ రాశారని, పార్లమెంటులో ఇండియా కూటమి ఎంపీలతో కలిసి లిబరేషన్ ఎంపీలు రాజారాం సింగ్, సుధామ ప్రసాద్ నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ట్రంప్ అమెరికా వైపు నిలబడుతుందా లేదా మన దేశ ప్రజలకు అండగా నిలుస్తుందా అనేది స్పష్టం చేయాలని అన్నారు.