
Mulugu
- నిబంధనలు తుంగలో తొక్కుతున్న “శ్రేష్ట ప్లాంటా ప్రొడక్ట్స్”..!
- చోద్యం చూస్తున్న అధికారులు.,.
- ప్రభుత్వ అనుమతులు లేకుండా “బయో మందుల” అమ్ముతున్న వైనం…
- తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పలువురు…
జన నిర్ణయం / ములుగు / ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైం బ్యూరో : ములుగు జిల్లా (Mulugu ) జంగాలపెల్లి కేంద్రంగా బయో మందుల అమ్మకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. బయో మందులు అమ్మకానికి సంబంధించిన ఎలాంటి అనుమతులు లేకుండానే “శ్రేష్ట ప్లాంటా ప్రొడక్ట్స్” ఇష్టారాజ్యంగా బయో మందులను ఆంధ్ర ప్రాంతంలోని గుంటూరు నుంచి తెచ్చి ఈ ప్రాంత రైతులకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ బయో మందుల అమ్మకాలకు లైసెన్స్ గానీ, జీ-1, జీ-2, జీ-3, కోర్టు ఆర్డర్ తదితర పర్మిషన్స్ లేకుండా “శ్రేష్ట ప్లాంటా ప్రొడక్ట్స్” పేరుతో గల షాపు నుంచి బయో మందుల దందా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి అనుమతులు లేని బయో మందులను క్రియ విక్రయాలు జరుగడం మూలంగా భూసారం తగ్గిపోవడం, పంటల దిగుబడి తగ్గిపోవడం, పంటలకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం లాంటి నష్టాలు ఉన్నాయాని పలువురు భావిస్తున్నారు. యధేచ్ఛగా జరుగుతున్న ఈ బయో మందుల దందా పట్ల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందనే ప్రచారం సాగుతోంది.
విశేషం ఏమిటంటే… ఈ “శ్రేష్ట ప్లాంటా ప్రొడక్ట్స్”మందుల షాపు “జంగాలపల్లి” ప్రాంతం కంటే నర్సంపెట ప్రాంతం రైతులకే ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయనేది గమనార్హం. ఏది ఏమైనప్పటికీ సంబంధింత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు.
Good information