
- కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునహరి శేషు….
- విజయవంతమైన జర్నలిస్టుల శిక్షణా శిబిరం
- వృత్తి నైపుణ్యంపై క్లాస్ బోధించిన కేయూ జర్నలిజం విభాగం అధ్యాపకులు కంజర్ల నర్సింహరాములు
Journalism is the compass for society : సమాజానికి దిక్సూచి జర్నలిజమేనని జర్నలిజం వృత్తి ఏంతో బాధ్యతాయుతమైనదని కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు తిరునహరి శేషు అన్నారు. సీనియర్ జర్నలిస్టులు జక్కుల విజయ్ కుమార్, జన నిర్ణయం ఎడిటర్ దామెర రాజేందర్ కో-ఆర్డినేటర్లుగా నిర్వహించిన జర్నలిస్టుల శిక్షణా శిబిరం బుధవారం కాశీబుగ్గ స్కాలర్స్ పబ్లిక్ స్కూల్ జరిగింది. ఈ సందర్భంగా తిరునహరి శేషు హజరై ప్రారంభోపన్యాసం చేశారు. పాలకులకు, ప్రజలకు వారధిగా పత్రికలు ఉండే క్రమంలో జర్నలిస్టులు బాధ్యతతో ముందుకు సాగాలని అన్నారు. సమాజంలో మరుగనపడ్డ సమస్యలను, వివిధ అంశాలను వెలికితీయడంలో జర్నలిస్టు తమదైన శైలిలో ముందుకు సాగడం అభినందనీయమన్నారు. సోషల్ మీడియా ప్రభావం పేరుగుతున్న నేపధ్యంలో నేటితరం జర్నలిస్టులు మరింత అప్రమత్తంగా ఉండటంతోపాటు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి శిక్షణా శిబిరాలు భవిష్యత్తులో కొనసాగించాలని అన్నారు. నిర్వాహకులను అభినందించారు.
Journalism is the compass for society
వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి
- కేయూ జర్నలిజం విభాగం అధ్యాపకులు కంజర్ల నర్సింహరాములు
మారుతున్న కాలానికనుగుణంగా జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని కేయూ జర్నలిజం విభాగం అధ్యాపకులు కంజర్ల నర్సింహరాములు అన్నారు. వార్తలు, స్టోరీలు, వార్తాసేకరణ, శీర్షికలు, లీడ్, సూపర్ లీడ్, వాక్యనిర్మాణం తదితర అంశాలపై ఈ క్లాసులో చర్చించారు. జర్నలిజం పరిణామా క్రమాన్ని వివరించారు. పత్రికా రంగంలో నాటికి నేటికి వచ్చిన మార్పులను, ఆ మార్పులకనుగుణంగా నేటితరం జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని బోధించారు.
Journalism is the compass for society
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, వివిధ మండలాలు, ప్రాంతాల నుంచి నుంచి వర్కింగ్ జర్నలిస్టులు హజరై శిక్షణా శిబిరానికి హాజరుకాగా స్కాలర్స్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ వెంకటరత్నం, పి. సురేందర్, కిరణ్, స్వామిదాస్, ఆర్. శ్రీనివాస్, శంకర్, కె. వెంకన్న ,రాజేందర్, రవి కుమార్, సాయి, సందీప్, వెంకటేశ్వర్లు, గణేష్, మధు, నరేష్, యాకూబ్, కె. రాజేందర్, పి. శ్రీనివాస్, సుమన్, రాణా ప్రతాప్, తరుణ్ తేజ్, మోహన్, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.