
Oplus_131072
ఎంసిపిఐ(యు) మండల కార్యదర్శి కనకం సంధ్య డిమాండ్
Guarantees should be implemented కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా గీసుగొండ మండల కార్యదర్శి కనకం సంధ్య ఆధ్వర్యంలో తహశీల్దార్ కు మెమోరాండం ఇచ్చారు. అనంతరం మండల కార్యదర్శి కనకం సంధ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ప్రజలకు అమలు కాని హామీలను ఇచ్చి ఈరోజు ఎత్తేస్తుందని వారన్నారు. అమలు కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో బొంద పెడతారని తెలుసుకొని కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటూ కేంద్రం మీద నెట్టివేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపు కోవడానికి చూస్తుంది అంటూ వారు కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు 420 హామీలను కూడా అమలు చేయాలని వాడు డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్వో గారికి పలు డిమాండ్లతో కూడిన మెమోరండాన్ని అందజేశారు.
డిమాండ్లు
1, ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి. వీటి అమలుకు కావలసిన నిధులను ఈ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించాలి.
2, హామీల అమలకు కావలసిన నిధుల సేకరణకు 100 కోట్ల ఆస్తి పైబడి ఉన్న వారందరికీ ప్రజా సంక్షేమ టాక్స్ ని అమలు చేయాలి
3, బడ్జెట్లో విద్య, వైద్య, మహిళ, యువజన సంక్షేమ రంగాలకు 40 శాతం నిధులు కేటాయించాలి
4, గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములలో ఉన్న పేద ప్రజలకు చట్టబద్ధత కల్పించి పట్టాలు ఇవ్వాలి వారందరికీ ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలి
5, ప్రభుత్వ భూములను చట్టంలో ఉన్న వసుగులు ఆసరాగా చేసుకుని రెవెన్యూ అధికారులతో కలిసి అక్రమంగా చేసుకున్న పట్టాలను రద్దుచేసి పేద ప్రజలకు పంపిణీ చేయాలి
6, ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మంజూరు చేయాలి
7, మిర్చి రైతం గానికి రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరతో బోనస్ ప్రకటించి కొనుగోలు చేసి మిర్చి రైతాంగాన్ని పసుపు రైతాంగాన్ని ఆదుకోవాలి
8, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను 6 నెలల్లో పూర్తి చేయాలి• ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి
9, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేద ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు నిర్వహించాలి
10, శాసనసభ చట్ట సభల్లో బీసీలకు బిసి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించే తీర్మానం ఆమోదించాలి
11, విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి• కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానించాలి రానున్న బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి • ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి• ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి• ప్రైవేట్ విద్యా రంగాన్ని రద్దు చేయుటకుచర్యలు తీసుకోవాలి
12, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిడి పెంచే విధంగా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించి ఢిల్లీకి అఖిలపక్ష పార్టీల బృందాన్ని తీసుకుపోవాలి.
ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు గూడసురేష్ సోమిడి రవి మండల కమిటీ సభ్యులకు పులి చేరి సుధాకర్ జెట్టి రాజు చిర సారయ్య పెండాలమల్లయ్య కుడుముల రంజిత్ నల్ల పోతుల హేమ కొమ్ము లక్ష్మి జక్కుల కోమాల బోనగిరి గారు నా మేకల పూలమ్మ కుమారస్వామి నరసవ రాజమ్మ చీర లక్ష్మి పాల్గొన్నారు.