
- అనుమతులేవ్…ఆపై ఇష్టారాజ్యం..!
- నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న “డాఫోడిల్స్” హైస్కూల్….
- ఇదే దారిలో మరి కొన్ని పాఠశాలలు…
- డాఫోడిల్స్ హైస్కూల్ యజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎఫ్డిఎస్ డిమాండ్
“Daffodils” High School, against the rules : విద్యా వ్యాపారం సర్వసాధారణంగా మారింది. ఇందుకు వరంగల్ జిల్లా నర్సంపేటలోని డాఫోడిల్స్ హైస్కూల్ సాక్ష్యంగా నిలుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతుల మాటెరుగు నిబంధనలకు విరుద్ధంగా ఆ పాఠశాల వ్యవహారం ఉన్నట్లు విద్యార్థి సంఘాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడమే ఇందుకు సాక్ష్యంగా పలువురు భావిస్తున్నారు. అధికారులంతా తమ గుప్పిట్లోనే ఉన్నట్లుగా డాఫొడిల్స్ హైస్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తుందనే ప్రచారం లేకపోలేదు. ఇదే తరహాలో పలు పాఠశాలలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే సరైన అనుమతులు లేకపోయినా, కనీసం బోర్డు కూడా లేకుండా స్కూల్ నిర్వహించడం వారికే చెల్లిందనేది గమనార్హం. ఈ హైస్కూల్ పై తక్షణమే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
“Daffodils” High School, against the rules
నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ, ప్రభుత్వాన్ని, విద్యార్థులను మోసం చేస్తున్న ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ( ఏఐఎఫ్డిఎస్ ) నాయకులు నర్సంపేట ఎంఈఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విద్యను ఒక వ్యాపారంగా మార్చుకొని లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారని ఆరోపించారు.
“Daffodils” High School, against the rules
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ పాఠశాలల్లోనే అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా డాఫోడిల్స్ పాఠశాల యజమాన్యం ఎలాంటి ప్రభుత్వం అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారన్నారని ఆరోపించారు. పాఠశాల పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కల్లేపల్లి రాకేష్, ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.