
Bc azaadi cycle yatra బీసీలకు రాజ్యాధికారం అనే కోణంలో సైకిల్ యాత్రలో భాగంగా ఆరవ రోజు శాయంపేట మండలంలో తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు తీన్మార్ జై సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆజాది సైకిల్ యాత్ర కన్వీనర్ బత్తుల సిద్దేశ్వరులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటే పల్లెలలో గెలిచినప్పుడే పార్లమెంటులో గెలుస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే చాపర్తి కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2 ఆదివారం ఆర్ట్స్ కాలేజీ హనుమకొండ ఆచార్య జయశంకర్ ప్రాంగణంలో ఓరుగల్లు బీసీ మహా గర్జన యుద్ధభేరి బహిరంగ సభకు పల్లె పల్లె నుండి గడపగడప నుండి బీసీ, వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని బీసీల ఆత్మగౌరవ రాజ్యాధికార దిశగా బీసీలు యుద్ధం చేసి రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే బీసీలకు నిజమైన ఆత్మ గౌరవం అని అన్నారు .ఈ సందర్భంగా తీన్మార్ జై మాట్లాడుతూ యువకులు, విద్యావంతులు మహిళలు సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం సతీష్ ఆజాది అంబే, బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి, మాజీ ఎంపీటీసీ శంకరాచారి, బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ,ఓబీసీ నాయకుడు ఉప్పు రాజు, మున్నూరు కాపు మండల కార్యదర్శి అడప ప్రభాకర్, మున్నూరు కాపు మండల ఉపాధ్యక్షుడు శ్రీరాముల అనిల్, బిసి నాయకుడు గిద్దమారి రాము, బిసి నాయకుడు మాజీ సర్పంచి రవి, చింతల భాస్కర్, తెలంగాణ కొమురయ్య, వీరన్న, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.