
ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్
ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో సకల అసమానతలను రూపుమాపి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, హక్కులను కాపాడడం కోసం వ్రాసుకొని సమర్పించుకున్న రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా పరాయి పాలనకు గురై, 2500 ఏండ్లుగా 6500 కులాలకు పైగా విభజించబడిన అసమానతల సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం తీసుకురావడం కోసం రచించిన గొప్ప రాజ్యాంగం నేడు దోపిడీ పాలకుల చేతిలో బంధీ అయి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చారని అన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యగ్గడి సుందర్ రామ్, జె జె స్వామి, వివిధ సంఘాల నాయకులు సింగారపు అరుణ, కరుణ, హరిబాబు, సారయ్య, మన్నె హరిబాబు, ప్రభాకర్, ఎలీషా, అజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.