
Hanumakonda district shayampet mandal శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అంబేద్కర్ యువజన సంఘం (AYC) అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య(ABSF) బహుజన సంక్షేమ సంఘం( BSS)ఆధ్వర్యంలో గ్రామసభలోని RI మరియు MPO కి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, నిరుపేదలైన ప్రజలను గుర్తించి లేనివారికి కచ్చితంగా అందేలా చూడాలని అధికారులను కోరారు. అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని అన్నారు. అధికార పార్టీలో ఉన్నవారికి ఇల్లు ఉన్న వారికి ఇల్లు రేషన్ కార్డు ఉన్నవాళ్లకే కార్డు అనే రీతిలో కనుక జరిగినచో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగం సుమన్ ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు ప్రతాప్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొంగర విజయ ప్రకాష్ బి ఎస్ ఎస్ నాయకులు ప్రసాద్ నాగుల కుమారస్వామి, నాళిక రాజు, తదితరులు పాల్గొన్నారు.